కాకినాడ : టపాసుల తయారీ కేంద్రంలో గురువారం పేలుడు సంభవించడంతో ఇద్దరు గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దపూడి మండలం రామేశ్వరంలోని బాణా సంచా తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.