ట్యాంక్ ఎక్కిన విద్యార్థులు
కరీంనగర్ : తమ గ్రామంలోని పాఠశాలలో విద్యనేర్పేందుకు ఉపాధ్యాయులను నియమించాలని చింతకుంటలోని విద్యార్థులు వాటర్ ట్యాంక్ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేశారు. టీచర్లు లేని కారణంగా తమ చదువుకు అంతరాయం కలుగుతోందని, వెంటనే టీచర్లను నియమించాలని వారు డిమాండే చేశారు. విద్యా బోధన జరగనందున త్రైమాసిక పరీక్షలు ఏ విధంగా రాయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. టీచర్ల బదిలీలు కారణంగా చాలా చోట్ల పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
News Posted: 1 September, 2009
|