నిజామాబాద్ : సీఎం పదవి చేపట్టడానికి జగన్ అర్హుడని పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ తనయుడు సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ సీఎం పదవి చేపట్టడానికి జగన్ కు అనుభవం లేదనటంలో అర్థం లేదన్నారు. జగన్ కన్నా చిన్న వయస్సులోనే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని సంజయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.