గ్యాస్ లీకై అగ్నిప్రమాదం
రాజమండ్రి : బిక్కవోలు మండలంలోని ఊలపల్లిలో గ్యాస్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతినగా, కుటుంబ యజమానికి గాయాలయ్యాయి. మిఠాయి వ్యాపారం చేసుకునే తంగెళ్ళ అప్పారావు అలియాస్ బాబు మిఠాయిను తయారీ చేసే పనిలో ఉండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో టీవీ, మిక్సీ, దుస్తులు, ఫర్నీచర్, ఇతర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అప్పారావు సిలిండర్ ను బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పగా, అతనికి మాత్రం గాయాలయ్యాయి. కాగా అనపర్తి ఫైర్ ఆఫీసర్ సీహెచ్ కృపాకరం ఆద్వర్యంలో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 50 వేల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని సర్పంచ్ పోతుల ప్రసాదరెడ్డి, తహసిల్దార్ సీహెచ్.వెంకటేశ్వరరావులు సందర్శించారు.
News Posted: 9 September, 2009
|