'ఆశ్రం'లో రాష్ట్ర స్థాయి సెమినార్
ఏలూరు : రాష్ట్ర స్థాయిలో పెధాలజిస్టుల సెమినార్ 'ఆశ్రం' ఆస్పత్రిలో గురువారం ప్రారంభంకానుంది. ప్రపంచాన్నిగడగడలాడిస్తున్న కొత్త వ్యాధులు పుట్టుకొన్న తరుణంలో పెధాలజీ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆశ్రం వైద్యకళాశాల పెధాలజీ విభాగాధిపతి, ప్రొఫెసర్ పి.వి.బి.రామలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సెమినార్ లో ఎన్నో కొత్త విషయాలపై చర్చలు జరగనున్నట్లు చెప్పారు. అలానే వ్యాధులు విజృంభించకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది ప్రముఖ పెధాలిజిస్టులు సెమినార్ కు రానున్నారు. ఈ సమావేశంలో కళాశాల పెధాలజీ విభాగాధిపతి జీఎం హరిబాబు, ప్రొఫెసర్ ఆర్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 10 September, 2009
|