పెండ్లి మర్రి ఏఈ హత్య
కడప : జిల్లాలోని పెండ్లిమర్రి మండలంలో ఆర్.డ.బ్ల్యూ ఎస్ లో ఏఈగా పనిచేస్తున్న రామనర్సయ్య ఈ రోజు తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. దొంగ తనానికి వచ్చిన దుండగులు ఇంటి యజమానిని దారుణంగా హతమార్చిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అడ్డు వచ్చిన ఆయన భార్యను కూడా గాయపరిచి, ఆభరణాలును చోరీ చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 11 September, 2009
|