కలప స్మగ్లర్ల కాల్చివేత
కరీంనగర్ : అటవీ ప్రాంతంలో కలపను తరలిస్తున్న స్మగ్లర్లలో ముగ్గురు స్మగ్లర్లు శనివారం జరిగిన కాల్పుల్లో మరణించారు. కరీంనగర్ జిల్లాలోని చంద్రాపూర్-ఆళ్ళపల్లి అడవుల్లో కలపను తరలిస్తున్న75 మంది స్మగ్లర్లపై మహారాష్ట్ర పోలీసులు కాల్పులు జరపగా 70 మంది పారిపోగా, ముగ్గురు స్మగ్లర్లు మృతి చెందారు. కలపను తరలిస్తున్న స్మగ్లర్లు పోలీసులపైకి రాళ్ళు విసిరి తప్పించుకునే ప్రయత్నంచేయగా, తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో స్మగ్లర్లు మృతిచెందినట్లు సమాచారం.
News Posted: 12 September, 2009
|