టీవీలోనే కంప్యూటర్ సేవలు
కరీంనగర్ : టీవీలో కంప్యూటర్ సేవలు ఇక సులభతరం కానున్నాయి. కంప్యూటర్ కోసం పాతికవేలు వెచ్చించకుండానే బీఎస్ ఎన్ ఎల్ 'కనెక్ట్ హోం' ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ఇంట్లో ఉన్న టీవీలో ద్వారా కంప్యూటర్ సేవలు పొందేందుకు పెద్దపల్లి బీఎస్ ఎన్ ఎల్ కనెక్ట్ హోం విధానాన్ని ప్రవేశపెట్టి అందరి కలలు నేరవేర్చుతోంది. శుక్రవారం కనెక్ట్ హోం ద్వారా కంప్యూటర్ విధానంపై జేఈలు కిషోర్, వెంకటేశ్వర్లు వినియోగదారులకు వివరించారు. బీఎస్ ఎన్ ఎల్ ల్యాండ్ ఫోన్ వినియోగదారులు కొత్త కంప్యూటర్ల కోసం పాట్లు పడాల్సిన అవసరం లేదన్నారు. 99 రూపాయలు, 150 ప్యాకేజీలతో ఇంటర్నెట్ సౌకర్యం, 1600 రూపాయలతో బ్రాండ్ సేవలు అందిస్తోందన్నారు. కొత్త వినియోగదారులు 500 రూపాయల డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లితండ్రులు, ల్యాండ్ ఫోన్ వినియోదారులు పాల్గొన్నారు.
News Posted: 12 September, 2009
|