కాలుష్య రహిత బ్యాగ్ లు
రాజమండ్రి : కాలుష్య రహిత సమాజం కోసం తనవంతు కర్తవ్యంగా సహాయం చేయాలని తపన కలిగిన రావులపాలం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కాళ్లకూరి హరినాథ్ జాలీ క్లాత్ తో బ్యాగ్ ల తయారీనీ ప్రారంభించారు. ఈ బ్యాగ్ లు కొద్ది రోజుల్లోనే మట్టిలో కలిసి పోతాయని తద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని ఆయన తెలిపారు. 1984లో హరిసన్స్ బ్యాగ్ వర్క్స్ పేరిట బ్యాగ్ లు, సైకిల్ సీటు కవర్లు తయారీ ప్రారంభించిన కాళ్ళకూరి ప్రస్తుతం కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్న ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఈ జాలీ బ్యాగ్ లను తయారు చేస్తున్నారు. భార్య సహకారంతో, కుమారులైన రాజేష్ గుప్తా, బ్రమేష్ గుప్తాలతో పాటు సుమారు 20 మందికి ఈ బ్యాగ్ ల తయారీ ద్వారా ఉపాదిని కల్పిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడలలో లభించే ఈ జాలీ క్లాత్ తో గ్రామగ్రామన బ్యాగ్ లు తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు. రాజీవ్ యువశక్తి పథకం ద్వారా స్థానిక కరూర్ వైస్యాబ్యాంక్ లో 3 లక్షల రూపాయలు రుణం పొంది కాలుష్య రహిత జాలీ క్లాత్ బ్యాగ్ ల తయారీని ప్రారంభించానని ఆయన పేర్కొన్నారు.
News Posted: 21 September, 2009
|