సాయి పుణ్యతిథి మహోత్సవం
కరీంనగర్ : పట్టణ శివారులోని శ్రీ షిర్ది సాయిబాబా 91వ పుణ్యతిథి అంగరంగ వైభవంగా మంగళవారం నిర్వహించారు. ప్రతి సంవత్సరం విజయదశమి తర్వాత సాయి పుణ్యతిథిని ఘనంగా నిర్వహించు కోవడం ఇక్కడి ఆనావాయితీ..మరో షిర్డిగా పేరున్న సాయిబాబా దేవాలయంలో సాయి పుణ్యతిథికి లక్షకు పైగా భక్తులు హాజరై బాబాను ద ర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలతో బాబా పుణ్యతిథి ప్రారంభం అయింది. దేవాలయ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ ఎంఎ.గఫార్లు ప్రారంభించారు. అనంతరం సాయి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పాలక మండలి అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించారు. జగిత్యాల డిఎస్పి వీరారెడ్డి సాయిబాబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
తహసీల్దార్ శ్యాం ప్రసాద్ లాల్, విశాఖ పట్టణం డిప్యూటి కమీషనర్ శంకర్లు పుణ్యతిథి వేడుకల్లో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం కోరుట్ల బస్టాండ్ నుండి ప్రత్యేక ఆర్టీసి బుస్సులు నడిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సిఐ జితేంధర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కీల్ పరిధిలోని ఎస్ఐలు శ్రీనివాస్రావు, విష్ణు, కాశయ్య, రమేష్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ పుణ్యతిథిలో ఆలయ కమిటీ ఆధ్యక్షులు గోనే విఠల్ మండలి సభ్యులు, వివిధ పార్టీ నాయకులు లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
News Posted: 30 September, 2009
|