కర్నూలు : వరదల విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా ఆదోనీ డీఎస్పీ కృష్ణమూర్తిపై సస్పెన్షన్ వేటు పడింది. వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆదోని డీఎస్పీని సస్పెంట్ చేస్తున్నట్లు బుధవారం అదనపు డిజి ఏకె ఖాన్ ప్రకటించారు. వరద సహాయక చర్యల్లో పోలీసులు మానవతావాదంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.