బాధితులను ఆదుకోండి :కలెక్టర్
కరీంనగర్ : వరద బీభత్సవానికి గురైన బాధితులను ఆదుకునేందుకు జిల్లా వాసులు సహృదయంతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ సుల్తానీయా కొరారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలో వరదల వల్ల సర్వస్వం కొల్పోయిన వారు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు ప్రజలు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి వారిని ఆదుకునేందుకు బట్టలు, వంటసామాగ్రిని విరాళాల రూపంలో సేకరించాలని కొరారు.
కర్నూలు, మహాబూబ్నగర్ జిల్లాలో కురిసిన బారీ వర్షాల మూలంగా ప్రజలను ఆదుకుని వారికి సేవలందించేందుకు కరీంనగర్ జిల్లా నుండి వంద మంది మున్సిపల్ సిబ్బందిని కర్నూలు జిల్లాకు పంపించడం జరుగుతుందని తెలిపారు. వారిని కో ఆర్డినేషన్ చేసేందుకు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్తో పాటు సానీటరీ ఇన్స్పెక్టర్ను కర్నూలు జిల్లాకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. వరదబాధితులను ఆదుకునేందుకు అనేక సంస్థలు జిల్లా నుండి ముందుకు వస్తున్నారని అన్నారు. విరాళాలు స్వీకరించేటప్పుడు నగదు రూపంలో కాకుండా చెక్కులు, డి.డిలు తీసుకుని సి.ఎం రిలీఫ్ ఫండ్ పంపించాలని కోరారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి ట్రకు బియ్యం, బట్టలు పంపిస్తున్నట్లు తెలిపారు. రెడ్క్రాస్ సోసైటీ నుండి పదివేల ఒక వంద రూపాయల చెక్కును ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్కు అందజేశారు.
News Posted: 7 October, 2009
|