లారీలు ఢీ : ఇద్దరు మృతి
నెల్లూరు : కావలి, మద్దూరుపాడు సమీపంలో రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలో శనివారం ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 10 October, 2009
|