కర్నూలు : జిల్లాలోని సుంకేశుల బ్యారేజీ పనులు నిలిపివేయాలని సోమవారం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వరద బాధితులకు పరిహారం చెల్లించాలంటూ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మసూద్ అలిపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్యారేజీ వద్దకు చేరుకుని గ్రామస్తులకు హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.