ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో బుధవారం ఓ బాలుడిపై ఏనుగు దాడి చేసింది. దేవాలయం ముందు నిలబెట్టిన ఏనుగు తొండాన్ని మూడేళ్ళ బాలుడు తాకబోతుండగా ప్రమాదవశాత్తూ గజరాజు పాదాల కింద పడినట్లు తెలుస్తోంది. వంటనే మావటి వెంకట్ అనే బాలుడుని తీసి తల్లితండ్రులకు అందించాడు. ఈ ఘటనలో గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.