ఎస్పీ వివరణ
కర్నూలు : ముఖ్యమంత్రి రోశయ్య వరద బాధితుల పర్యటనలో ఏర్పడిన అపశృతులపై బుధవారం కర్నూలు ఎస్పీ శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. ఆర్ అండ్ బి నిబంధనల మేరకే తాము హెలిప్యాడ్ నిర్మించామని, పైలట్లకు ఇబ్బంది తలెత్తినట్లు తమకు ఎలాంటి సమాచారమూ అందలేదని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన ముంగిచి వెళ్ళిపోయిన గంట తర్వాతనే ఆయన కుర్చీకిందకు పాము వచ్చిందని తెలిపారు. అదే విధంగా పంచలింగాలలో ముఖ్యమంత్రి కాన్వాయ్ పై రాళ్ళు విసిరినట్లు అనుమానిస్తున్న పది మంది గ్రామస్తులను అరెస్ట్ చేసి విచారించినట్లు తెలిపారు. అయితే బాధితులు మాత్రం పోలీసులు తమను తీసుకెళ్ళి అకారణంగా చితకబాదారని ఆరోపిస్తున్నారు.
News Posted: 14 October, 2009
|