కడప : జిల్లాలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురిగి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నమండెం మండలం సాకిబండ వద్ద గురువారం ఉదయం పెళ్లి బృందంతో వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించుకోబోయి బోల్తా పడింది. ఈ సంఘటనలో 25 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానతిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా వారిలోవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.