డయల్ యువర్ కలెక్టర్
కడప : జిల్లాలోని అన్ని రంగాల ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి 'డయలు యువర్ కలెక్టర్' కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను కలెక్టర్ శశిభూషణ్ కుమార్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన సమస్యలపై ఆరా తీశారు. ఒక్కొక్కటి చదివి ఆయా సమస్యలను పరిష్కరించారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ కు 15 లక్షల రూపాయలతో వేసిన రహదారి అసంపూర్తిగా ఉందని దాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలసపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఎల్లారెడ్డి కోరారు. కాశినాయన మండలం వడ్డెనూరు గ్రామంలో సంవత్సరంగా డీలర్ లేడని, నామ్కేవాస్త్గా గురవయ్యను డీలరుగా నియమించారని, అను సరుకులను సక్రమంగా పంపిణీ చేయక అక్రమాలకు పాల్పడుతున్నాడని, రెగ్యులర్ డీలర్ను నియమించాలని ఆ గ్రామానికి చెందిన చిన్నయ ఫిర్యాదు చేశాడు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని పుల్లంపేట మండలం చొప్పారిపల్లె గ్రామానికి చెందిన 18 మంది మహిళలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గిరిజాశంకర్, హౌసింగ్ పిడి రామసుబ్బు, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ మార్కారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
News Posted: 27 October, 2009
|