1న శ్రీశ్రీ శతజయంతోత్సవాలు
రాజమండ్రి : ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రజానాజ్యమండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఉత్సవానికి సంబంధించిన విశేషాలను ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర్ చౌదరి, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు డా.చెలికాని స్టాలిన్ లు వివరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీశ్రీ పాటల పోటీలు, శ్రీశ్రీ గేయాల నృత్యరూపకాలు, యుగ పురుషులు కందుకూరి నాటకంలో ఘట్టాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రాలను, జాంపేట, ఆర్యాపురం, ఇన్నీసు పేట కో ఆపరేటివ్ బ్యాంకుల సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డులను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు.
News Posted: 27 October, 2009
|