28న ఉచిత కళ్యాణమస్తు
నిజామాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్టోబర్ 28న నిర్వహిస్తున్న ఉచిత కళ్యామస్తు కార్యక్రమములో అర్హులైన జంటలు వివాహం చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె.సునీత అధికారులను ఆదేశించారు. టిటిడి అధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాలని కలెక్టర్ చెప్పారు. పేద వర్గాల వారికి ఈ కార్యక్రమము ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందన్నారు. పెళ్లి మండపాల వద్ద హెల్త్ క్యాంప్లు నిర్వహించాలని జిల్లా ఆరోగ్య వైద్యాశాఖాదికారి సుగుణను కలెక్టర్ ఆదేశించారు. నిజామాబాద్, ధర్పల్లి, బోధన్, బాన్స్వాడ, కామారెడ్డిలలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపాలలో నిర్వహిస్తుండగా ఆర్మూర్లో క్షత్రియ కళ్యాణ మండపంలో, పోచంపాడులోని రామాలయంలో, ఎల్లారెడ్డిలోని నీల కంఠేశ్వరాలయంలో, మద్నూర్లోని హనుమాన్ మందిరంలో జరుగుతాయన్నారు. సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చూసుకోవాలన్నారు.
News Posted: 27 October, 2009
|