'అక్రమ కేసులను ఎత్తేయాలి'
కడప : జిల్లాలోని తెలుగంగ రిజర్వాయర్ కిందగల మైదకూరు మండలంలోని ఎల్లాయపల్లె, మిట్టమానుపల్లె, లింగలదిన్నెపల్లె, శెట్టివారిపల్లె, దువ్వూరు మండలంలోని చింతకుంట చెరువులకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆదివారం ఆందోళన చేసిన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, జిల్లా నేతలు వెంకటస్వామిరెడ్డి, మండలాధ్యక్షుడు బి.పి.సుధాకర్ రెడ్డిలతో పాటు అఖిలపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఖండించారు. ఎండిపోతున్న పంటలకు నీరివ్వమని రైతుల తరఫున ఆందోళన చేస్తే అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై కాంగ్రెస్ నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అఖిలపక్ష నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి, వెంటనే చెరువులకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
News Posted: 27 October, 2009
|