ఎమ్మెల్యే ఇంటి వద్ద పేలుడు
అనంతపురం : అనంతపురం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఇంటి వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ రోజు తెల్లవారుజామున ద్విచక్రవానంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనలో ఆయన ఇంటి వద్ద ఉన్న ఒక ద్విచక్ర వాహనం ధ్వంసమైనట్లు గుర్తించారు. సమాచారం అందుకున్నతెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనాస్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఈ పేలుడులో ఉపయోగించిన బాంబును పొగబాంబుగా గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే గురునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ఎవరూ శత్రువులు లేరని, ఈ బాంబు దాడి ఎందుకు జరిగిందో తేలియదని అన్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలూ స్పష్టమవుతాయని ఆయన అన్నారు.
News Posted: 30 October, 2009
|