శ్రీశైలం: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలోని పురాతన నంది విగ్రహాన్ని అపహరించేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. అయినా అతని ప్రయత్నం బెడిసికొట్టింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ దుండగుడు వారిని ఏమార్చి పరారయ్యాడు. దీంతో ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.