నిజామాబాద్ : రోజు రోజుకు విద్యార్ధులు బలవంతంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అందునా హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న అరవింద్ సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణా యూనివర్శిటీలో ఎంఏ చదువుకుంటున్న సరిత అనే విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్యా యత్నాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు.