ఏసీబీ వల్లో ఈఈ కార్యాలయం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పంచాయితీరాజ్ ఈఈ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం దాడి చేశారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బందే అవినీతికి పాల్పడినట్లు సమాచారం అందడంతో వారు ఈ దాడి చేశారు. ఈఈ కార్యాలయం సూపరిటెండెంట్ నుంచి 3 వేల రూపాయలు, జూనియర్ అసిస్టెంట్ నుంచి 8 వేల రూపాయలు, అటెండర్ నుంచి 5 వేల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News Posted: 10 November, 2009
|