బాధితులను ఆదుకోండి : ఆనం
నెల్లూరు : జిల్లాలో వర్షాల ప్రభావం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. వరద బాధితులను సహాయాన్ని అందించడంలో జాప్యం చేయవద్దని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు, కావలి, గూడూరు పట్టణాల్లో కాలనీలు నీటమునిగాయి. సుమారు 5 వేల ఎకరాల్లో వరినార్లు నీటమునిగాయి.
News Posted: 11 November, 2009
|