కరీంనగర్ : కరీంనగర్ రేంజి డీఐజీగా డాక్టర్ ఎ.రవిశంకర్ అయ్యన్నార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో మంచి అధికారిగా ఈయనకు పేరుంది. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం కంటే శాశ్వత పరిష్కారం అవసరమని నమ్మి ఆచరించే వ్యక్తిత్వమున్న అధికారిగా ఆయన మంచి గుర్తింపు పొందారు. ఈ జిల్లాలో పనిచేస్తున్న చంద్రమౌళికి మెరైన్ డీఐజీగా బదిలీ అయింది. 2007లో కరీంనగర్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన చంద్రమౌళి దాదాపుగా రెండేళ్ళపాటు ఇక్కడ పనిచేశారు. ఎన్నికల సమయంలో జిల్లాను ప్రశాంతంగా ఉంచడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.