నిజామాబాద్ : కట్టుకున్న భర్తే భార్యపై యాసిడ్ దాడి చేయడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు అధికం కావడంతో హెడ్ కానిస్టేబుల్ తన భార్యపై యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు. దీంతో గాయపడిన ఆమెను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.