ఎన్కౌంటర్లో మావో మృతి
కడప : కడప జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. జిల్లాలోని గాలివీడు మండలం తుమ్మిగుంట సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులకు, మావోలకు మధ్య సుమారు 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మృతి చెందిన మావోను చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందిన నాగార్జున రెడ్డి, అలియాస్ శివగా గుర్తించినట్లు ఎస్ పి చౌహాన్ తెలిపారు. సంఘటనా స్థలం వద్ద రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 19 November, 2009
|