కలుపుకు పోదాం : కలెక్టర్
నంతపురం : రానున్న కొత్త సంవత్సరం నుంచి అన్ని కుల, మత బేధాలకు అతీతంగా పేద దళితులను, గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపించడానికి అందరినీ ‘కలుపుకు పోదాం’ అని జిల్లా కలెక్టర్ బి.జనార్ధన్రెడ్డి ప్రజలకు పిలిపునిచ్చారు. గురువారం స్థానిక డ్వామా హాలులో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నూతన సంవత్సరంలో ప్రతి పేద మహిళలోనూ ఆత్మస్థైర్యం నింపి, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి జిల్లా యంత్రాంగం పనిచేయాల్సిన అవసరం చాలా వుందన్నారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పావులా వడ్డీతో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో 101 కోట్ల రూపాయలు, పట్టణ మురికి వాడల ప్రాంతాలకు 31 కోట్లరూపాయలను పంపిణీ చేయనున్నామన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఎస్సీల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ పోలీసు, విజిలెన్స్ కమిటీ బృందానికి సూచించారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా పోలీసు స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయితే వెంటనే కేసు దర్యాప్తు చేసి నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలని జిల్లా ఎస్పీ ఎంకె సింగ్ ఆయా ప్రాంతాల డిఎస్పీలను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్వో సుదర్శన్రెడ్డి, ఐసిడిఎస్ పిడి ముత్యాలమ్మ, డిప్యూటీ డిడి రావి మాధవరావు, డిటిడబ్ల్యూఓ ప్రతిభా భారతి, కమిటీ సభ్యులు, సోషల్వెల్ఫేర్ డిడి విజయ్కుమార్, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు పాల్గొన్నారు.
News Posted: 27 November, 2009
|