వైభవంగా సీతారాముల కల్యాణం
నెల్లూరు : పొదలకూరులోని బాబా మందిరం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఓపన్ ఆడిటోరియంలో సీతారాముల కల్యా ణం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పొదలకూరు కిటకిటలాడింది. ఆలయంతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాలను సుందరంగా అలంకరించారు. ఓ వైపు సాయినామ సంకీర్తనలతో పాటు, మరో వైపు సీతారాముల కల్యాణ వేదమంత్రాల ఘోషతో పొదలకూరు పట్టణం మార్మోగింది. సాక్షాత్తు భద్రాచలంలో జరిగే సీతారా ముల కల్యాణాన్ని తిలకించినట్లు భక్తులు పరవసించిపోయారు. భద్రాచల దేవస్థాన ముఖ్య అర్చకులు రామచంద్రస్వామి, కృష్ణయ్యజుర్వేద, వేదపండితులు జిట్టి హనుమంత శాస్త్రి, ఆలయ పూజారి కొణిజేటి సత్యనారాయణశర్మ, రామభద్రాచార్యులు వేదమంత్రాలు చదువుతూ సీతారాముల కల్యాణం జరిపించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ కళ్యాణంలో షిర్డీ సాయి సేవా సమితి సొసైటీ కార్యదర్శి నాగి శెట్టి దామోదర్రావు, ఆయన సతీమణి శశిప్రభలు పెళ్ళి పెద్దలుగా వ్యవహరించారు.
News Posted: 3 December, 2009
|