నెల్లూరు : గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమంలో దత్తజయంతి సందర్భంగా నిర్వహించిన వెంకయ్యస్వామి అఖండ పారాయణ మహాయజ్ఞానికి దిగంబర అవధూత బుధవారం విచ్చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన దిగంబర అవధూత ఈ పారాయణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న బైనబోయినస్వామి పిలుపు మేరకు ఆయన విచ్చేశారు. ఈ సందర్బంగా భక్తులు అధికసంఖ్యలో దిగంబర అవధూతను దర్శించుకున్నారు. డీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.