నిజామాబాద్ : జిల్లాకు చెందిన విద్యాశాఖాధికారి భృగుమహర్షి ప్రభాకర్ రావు దగ్గరలంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు దొరికిపోయాడు. విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రభాకరరావు ఫించన్ ఫైల్ లో ఏజీ కార్యాలయానికి పంపించేందుకు విద్యాశాఖాధికారి భృగుమహర్షి ఐదువేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రియంచడంతో వారు పథకం ప్రకారం డీఈవో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.