కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం గొల్లపల్లిలో పదిమంది ఉద్యమకారులు సెల్ టవర్ ఎక్కారు. తెలంగాణ అధ్యక్షుడు కేసీఆర్ ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలానే ప్రత్యేక తెలంగాణను ప్రకటించాలనికూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తేనే కిందకు దిగుతామని టీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.