ఏలూరు : సమైక్యాంధ్ర కోసం పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కళ్యాణంపాడులో జ్యోతి అనే నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అలానే సమైక్యాంధ్రా కావాలంటూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా విశాఖపట్నంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏలూరు నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సులను దుండగులు ధ్వంసం చేశారు.