జానపద నాయకుడు మృతి
కరీంనగర్ : చూడ చక్కన తల్లీ వంటి జనపద పాటలను ఆలపించిన జానపద గాయకుడు వెంకటేష్ నాయక్ అకాల మృతి చెందాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గురువారం తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. గురువారమే హైదరాబాద్ నుంచి కరీంనగర్ మండలం చింతకుంటకు తరలి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన గత సంవత్సర కాలంగా తోటి కళాకారులకు, కళా సంస్థలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. జనపదాలే తన జీవన సర్వస్వంగా భావించిన ఆయన దూరం అయినందుకు తోటి కళాకారులు కోడురి రవీందర్ గౌడ్, కుమార్ మహార్షి, గజ్జె లక్ష్మన్, మనోహర్, వేముల సత్యనారాయణ, శ్రీధర్, రమేష్, కె.బిశర్మలు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నట్లు వారు తెలిపారు.
News Posted: 11 December, 2009
|