విద్యార్ధుల రైల్ రోకో
రాజమండ్రి : ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ పలుచోట్ల కాంగ్రెస్ నేతలు, కాలేజీ విద్యార్థులు భారీ ఎత్తున రాస్తారోకో, రైల్ రోకోలు నిర్వహించారు. రాస్తారోకో వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రాష్ట్ర విభజనకు ఐఎన్ టీయూసీ వ్యతిరేకమని జిల్లా ఉపాధ్యక్షుడు అడపా వెంకటరమణ పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజమండ్రి బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించారు. తెలుగు ప్రజలందరూ పోరాటానికి సిద్ధపడాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. సమైక్యాంధ్రకు అందరూ కట్టుబడి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు స్పష్టం చేశారు.
News Posted: 11 December, 2009
|