అనంతరపురం : శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థులు భారీ ర్యాలీకి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసింది. ఒకనొక దశలో ఎస్కెయూ ప్రాంగణంలో ఉస్మానియా క్యాపస్ను తలపించింది. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ పట్టణంలోని తెలుగుదేశం ఎమ్మెల్యేల నిరాహార దీక్షా శిబరం వద్దకు వెళ్ళాలన్నదే వారి ధ్యేయం. కాగా పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో ప్రొఫెసర్లు కూడా పాల్గొనడం విశేషం.