టీడపీ నేతల దీక్ష భగ్నం
అనంతపురం : సమైక్యాంధ్ర కోసం అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సమైక్యాంధ్రను కోరుతూ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి, పార్ధసారధిలతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు టీడీపీ నేతలను బలవంతంగా దీక్షా శిభిరం నుంచి పోలీసులు తరలించారు. దీక్ష చేస్తున్న నేతల ఆరోగ్యం క్షీణించినందునే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఐదురోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అనంత బంద్కు టీడీపీ పిలుపు నిచ్చింది. పట్టణంలో విద్యా సంస్థలు, వాపారస్తులు బంద్ పాటించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచి పోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
News Posted: 18 December, 2009
|