అనంతపురం : సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు దీక్షలో ఉన్న టిడిపి నాయకులపై పోలీసులు 309 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఆరోగ్యం విషమించినా సెలైన్ ఎక్కించుకోవడంతో పాటు వైద్య చికిత్స చేయించుకోవడానికి నిరాకరిస్తుండడంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇలా ఉండగా పరిటాల సునీత ఆరోగ్యం బాగా విషమించడంతో ఆమెను హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు యోచిస్తున్నారు.