అనంతపురం : క్రిస్మస్ పండుగ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని రామాలయం సమీపంలోని ఒక ఇంటిలో అకస్మాత్తుగా నాటుబాంబు పేలిన సంఘటనలో నాలుగవ తరగతి చదువుతున్న బాలుడొకడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. మరో పది మంది చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన బాలుడి సోదరుడికి రెండు కాళ్ళూ తెగిపోయాయి. ఈ సంఘటనతో తాడిపత్రిలో విషాద ఛాయలు అలముకున్నాయి.