ఏలూరు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దేవతలు కూడా దర్శించుకుంటారని ప్రసిద్ధి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు కూడా ఆరోజు తెల్లవారుజామునే స్వామివారిని ఉత్తర ద్వారం వద్ద నుండే దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ఎంవీఎస్ఎస్ విష్ణుప్రసాద్ తెలిపారు. క్యూలైన్ల కోసం ప్రత్యేకంగా బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తర ద్వారానికి రంగులు వేయడం తదితర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు.