క్రిస్ మస్ వేడుకలు
నిజామాబాద్ : క్రిస్ మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రార్థనాలయాలనువిద్యుత్ దీపాలతో అలంకరించారు. మండల కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎల్లారెడ్డి చర్చిలో ఫాదర్ రెవరెండ్ ప్రభాకర్ ఆధ్వరంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏస్తుక్రీస్తుకు సంబంధించిన భక్తిపాటలు, బైబిల్ పఠనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. లింగం పేట, సదశివ నగర్, నాగిరెడ్డి మండలాల్లో క్రైస్తవులు క్రిస్ మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
News Posted: 26 December, 2009
|