పార్టీలను కేసీఆర్ కు అమ్మేశారు
నెల్లూరు : తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను అక్కడి నేతలు కేసీఆర్ కు అమ్మేశారని నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ ప్రాంతం వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ఆయన నిలదీశారు. ప్రజల్లో లేని తెలంగాణ ఉద్యమాన్ని దౌర్జన్యంగా చేయాలనుకోవడం సరైన విధానం కాదని ఆయన హెచ్చరించారు. మంగళవారంనాడు ఆయన నెల్లూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిజంగా ప్రత్యేకం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్షే అక్కడి పార్టీల నాయకులకు ఉంటే తక్షణమే కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విడివడి బయటికి వచ్చి ప్రజల మద్దతు, మన్నన పొందాలని ఆనం సలహా ఇచ్చారు.
News Posted: 29 December, 2009
|