విభజిస్తే రక్తపాతమే
శ్రీశైలం : ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే రక్తపాతం సృష్టిస్తామని కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య హెచ్చరించారు. సమైక్య ఆంధ్ర కోరుతూ ఆయన బ్రమరాంబ మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కోందరు రాజకీయ నిరుద్యోగులు కుతంత్రాలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి పదవులు దక్కనందునే కేసీఆర్ ప్రత్యేక వాదాన్ని లేపారని మండిపడ్డారు. సోనియా, మన్మోహన్ లు తలుచుకుంటే ఈ కోర్ కమిటీ సమావేశాలు అవసరం లేదని అనంతయ్య అన్నారు.
News Posted: 4 January, 2010
|