అనంతపురం : బంద్ లు ఆర్టీసీని కుదేలు చేస్తున్నాయి. సీమాంధ్ర బంద్ కారణంగా ఆర్టీసీకి సుమారు 50 లక్షల రూపాయిల వరుకూ నష్టం వాటిల్లింది. ఈ రీజియన్ పరిధిలో 916 బస్సులు నడుస్తున్నాయి. ఇవన్నీ డిపోలకే పరిమితం కావడంతో రూ.50 లక్షలు భారం పడినట్లు ఆర్ ఎం శశిధర్ వెల్లడించారు.గత బంద్ కారణంగా సంస్థకు రూ. 6.20 కోట్లు మేర నష్టం వాటిల్లింది.