అనంతపురం : ఆర్బన్ ఐకైపీ-మెప్మా పని తీరు జిల్లాలో అధ్వానంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీ అనంతవెంకట రామిరెడ్డి తో కలసి ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో 650 మందికి ఉపాధి రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా అధికారులు కేవలం 306 మందికి మాత్రమే రుణాలివ్వడంపై అసహనం వ్యక్తం చేసారు.