ఏలూరు : ఎస్సీ కార్పొరేషన్ లో రెండేళ్ల క్రితం వెలుగు చూసిన నిధులు మాయం కేసు ఎట్టకేలకు కొలిక్కివస్తోంది. ఫోర్జరీ సంతకాలతో ఓ ఉద్యోగి మరో అధికారి తోడ్పాటుతో సుమారు 20 రూపాయల వరకు దారిమళ్లాయి. దీంతో ఈ వ్యనహారంపై జిల్లా సహకార అధికారిని విచారణ అధికారిగా నియమించారు. అయన తన విచారణ నివేదికను ప్రభుత్వానికి అందచేసారు. అయితే విచారణలో వెలుగు చూసిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.