అనంతపురం : పరిటాల రవీంద్ర హత్యకేసు తదుపరి విచారణ ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది. హత్య కేసు విచారణలో భాగంగా జిల్లా సెషన్స్ కోర్టు మరో నిందుతుడు వడ్డే శ్రీనును ప్రశ్నంచింది. మిగతా నిందుతులను కూడా ప్రశ్నించేందుకు వీలుగా కేసును వాయిదా వేసారు. ప్రశ్నించే ప్రక్రియలో భాగంగా కోర్టు ఇప్పటికే ఆరుగురు నిందుతులను విచారించింది.