కరీంనగర్ : జిల్లా పరిషత్ సమావేశం వాయిదా పడింది. జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటుగా సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. సమావేశం నిర్వహణకు యథావిథిగా వివిధ శాఖల ఉద్యోగులు హాజరయ్యారు. అయితే సభ్యులు ఎవ్వరూ రాకపోవడంతో అరగంట పాటు వేచి చూసిన సీఈఓ యాకూబ్ ఆలీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సాధన ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సభ్యులంతా రాజీనామాలు చేసారు.